Disha: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులకు ‘నిర్భయ’ కింద ఉరిశిక్ష పడాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది
  • ఈ ఘటనను ప్రతిఒక్కరూ ఖండించాలి
  • నిందితుల తరపున ఏ న్యాయవాది నిలబడకూడదు

డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, ప్రియాంక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసిందని, నిందితులకు నిర్భయ చట్టం కింద ఉరిశిక్ష పడాలని అన్నారు. ఈ ఘటనను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరముందని, నిందితుల తరపున ఏ న్యాయవాది నిలబడకూడదని కోరారు.

More Telugu News