Priyaanka: అవే చివరి విధులు... బుధవారం నాడు ప్రియాంకా రెడ్డి ఏం చేశారంటే..!

  • బుధవారం కొల్లూరు వెళ్లిన ప్రియాంక
  • మధ్యాహ్నం 2.30కి విధులు ముగించుకుని వెనక్కు
  • అదే రోజు రాత్రి హత్యాచారం

ద్విచక్ర వాహనం పంక్చర్ అయిన పాపానికి, రాత్రి వేళ కామాంధులకు చిక్కి హత్యాచారానికి గురైన వెటర్నరీ వైద్యాధికారిణి ప్రియాంక, బుధవారం నాడు నవాబుపేట మండలం కొల్లూరులో తుది విధులు నిర్వహించారు. బుధవారం నాడు రోజులానే ఉదయం ఇంటి నుంచి బస్టాండ్ వరకూ స్కూటీలో వచ్చి, అక్కడి నుంచి బస్సులో కొల్లూరు వెళ్లిన ప్రియాంక, అక్కడ విధుల అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి వెళ్లినట్టు గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.

ఇటీవల పశువులకు గాలి కుంటు వ్యాధి రాకుండా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించగా, ప్రియాంక చురుకుగా పాల్గొన్నారు. ముక్కుసూటి అధికారిణిగా గుర్తింపు పొందిన ప్రియాంకకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమని, తమ పశువులకు రోగాలు వస్తే, ఎన్నోమార్లు ఆమే స్వయంగా వచ్చి మందులిచ్చారని కొల్లూరు వాసులు కన్నీరు పెట్టుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడిలా జరగటాన్ని జీర్ణించుకోలేకున్నామని అంటున్నారు.

More Telugu News