Nagababu: 'జబర్దస్త్' నా షో అనుకుని చేశాను: నాగబాబు

  • ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం 
  • కష్టసుఖాలను పంచుకునే వాళ్లం 
  • పారితోషికం సమస్యే కాదన్న నాగబాబు

'జబర్దస్త్' కామెడీ షో జనంలోకి ఒక రేంజ్ లో దూసుకెళ్లిపోయింది. ఆ షోకి న్యాయనిర్ణేతగా నాగబాబు మంచి మార్కులు కొట్టేశారు. అలాంటి నాగబాబు కొన్ని కారణాల వలన బయటికి వెళ్లిపోయారు. కొంతమంది టీమ్ లీడర్లు ఆయనను అనుసరించారు. ఈ టీమ్ లీడర్లతో నాగబాబు ఇప్పుడు వేరే టీవీ చానల్లో కనిపిస్తున్నారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. 'జబర్దస్త్' షోకి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయినప్పటికీ .. ఇది మల్లెమాల షో అని కొందరు .. ఈటీవీ షో అని మరికొందరు అన్నప్పటికీ నేను ఆ విషయాలను గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇది నా షో అనుకుని చేసేవాడిని. 'జబర్దస్త్'కి సంబంధించిన వాళ్లమంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగతా వాళ్లమంతా కలిసి ఆదుకునేవాళ్లం. అక్కడి నుంచి నేను బయటికి రావడానికి పారితోషికం కారణం కానేకాదు .. అలా అని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు" అని స్పష్టం చేశారు.

More Telugu News