Abdullapurmet: విజయారెడ్డి హత్య తర్వాత నేడు తెరుచుకున్న అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం

  • 24 రోజుల క్రితం విజయారెడ్డి సజీవదహనం
  • పెట్రోల్ పోసి తగలబెట్టిన సురేశ్
  • తహసీల్దార్ గా బాధ్యతలను స్వీకరించిన వెంకట్ రెడ్డి

హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు మూతబడ్డ తహసీల్దార్ కార్యాలయం 24 రోజుల తర్వాత నేడు తెరుచుకుంది. తహసీల్దార్ గా వెంకట్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. అయితే, కార్యాలయ ఉద్యోగులు ఇంకా ఆ భయానక ఘటన నుంచి పూర్తిగా కోలుకోలేదు. ప్రతి ఒక్కరూ ఆవేదనలోనే ఉన్నారు. తమతో పాటు విధులను నిర్వహించిన విజయారెడ్డిని స్మరించుకున్నారు.

More Telugu News