kammarajyam lo kadapa redlu: డబ్బు కోసం రెండు కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టేందుకు వర్మ చూస్తున్నారు: కేఏ పాల్

  • కమ్మ కులస్తులను ‘ఇన్సల్ట్’ చేయాలని, రెడ్డీస్ ను ‘హైలైట్’ చేయాలని చూస్తున్నారు
  •  ఓ రెడ్డి కులస్తుడు వర్మకు రూ.5 కోట్లు ఇచ్చారట
  • ఇది నిజమో కాదో నాకు తెలియదు

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం టైటిల్ ను మారుస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు, ‘టీవీ9’లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్  మాట్లాడుతూ, ఈ చిత్రంపై విమర్శలు గుప్పించారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనేది ఏం టైటిల్ అని, రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే ఇలాంటి పేరు పెట్టారని విమర్శించారు.

కమ్మ కులస్తులను ‘ఇన్సల్ట్’ చేసి, రెడ్డీస్ ను ‘హైలైట్’ చేసేలా ఓ రెడ్డి కులస్తుడు వర్మకు రూ.5 కోట్లు ఇచ్చారని, అయితే, ఇది నిజమో కాదో తనకు తెలియదని అన్నారు. కేవలం, డబ్బు కోసం రెండు కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. పిచ్చోళ్లు తప్ప, మంచి వాళ్లెవ్వరూ ఈ సినిమా చూడరని అన్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలను చూశానని, తనను టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నట్టు చెప్పారని అన్నారు.

More Telugu News