ఎస్పీజీ చట్టం అసలు లక్ష్యాలను నెరవేరుస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేశాయి
- చట్టం అసలు ఉద్దేశాన్ని పునరుద్ధరిస్తున్నాం
- పీఎం, ఆయన అధికారిక నివాసంలో ఉండే కుటుంబానికే ఎస్పీజీ రక్షణ
అదేవిధంగా మాజీ ప్రధానితోపాటు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే వారి కుటుంబ సభ్యులకు ఐదేళ్ల కాలంపాటు ఎస్పీజీ భద్రతను కల్పిస్తామని తెలిపారు. గాంధీ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్పీజీ భద్రతను ఇటీవల కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్ట సవరణకుద్దేశించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.