Hindupuram: హిందూపురంలో ‘సామూహిక కోటి దీపోత్సవం’ను నిర్వహించిన నందమూరి బాలకృష్ణ .. ఫొటోలు ఇవిగో!

  • ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరి కీ ఉండాలి
  • అందరూ సుఖసంతోషాలతో ఉండాలి
  • కోటి దీపోత్సవంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు

పవిత్రమైన కార్తీక మాసం శుభసందర్భంగా, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుకున్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. హిందూపురంలో తన కుటుంబసభ్యులతో కలిసి తాను నిర్వహించిన ‘సామూహిక కోటి దీపోత్సవం’ కార్యక్రమానికి తరలివచ్చిన వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పరమేశ్వరుడి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను జతపరిచారు. కాగా, హిందూపురంలో నిన్న రాత్రి ‘సామూహిక కోటి దీపోత్సవం’ ను నిర్వహించారు.

  • Loading...

More Telugu News