Chota K Naidu: తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది: చోటా.కె నాయుడు

  • కొత్త కెమెరామెన్లు వస్తున్నారు 
  • సీనియర్లకు అవకాశాలు తగ్గుతున్నాయి 
  • ఇండస్ట్రీ కొత్త మోజులో వుందన్న చోటా

ఎన్నో విజయవంతమైన సినిమాలకు .. అగ్రహీరోల సినిమాలకు చోటా.కె నాయుడు కెమెరామెన్ గా పనిచేశారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను గురించి ప్రస్తావించారు. "ఇతర రాష్ట్రాల నుంచి కొత్త కొత్త కెమెరామెన్లు టాలీవుడ్ కి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో సినిమాను పూర్తి చేయాలనుకునేవారు కొత్తవాళ్లనే తీసుకుంటున్నారు.

అందువలన తెలుగులో సీనియర్ కెమెరామెన్లకి అవకాశాలు తగ్గాయి .. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు కెమెరామెన్లకి ఇప్పుడు పెద్దగా పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది. వాళ్లు ఆదేశించినట్టుగానే అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కొంతమంది కెమెరామెన్లు చేస్తున్న లైటింగ్ సరిగ్గా ఉండటం లేదు .. అయినా వాళ్లతోనే చేయిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ కొత్త అనే ఓ మోజులో ఉందంతే" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News