మహారాష్ట్రలో బీజేపీ బలపరీక్షపై నేడు సుప్రీం అత్యవసర విచారణ
- కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే
- నేటి ఉదయం 11:30 గంటలకు విచారణ
- ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలన్న మూడు పార్టీలు
కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగానే నిన్న ఉదయం బీజేపీ షాకిచ్చింది. ఉదయం ఎనిమిది గంటలలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమైంది.