Sarileru Neekevvaru: 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ వచ్చేసింది: మహేశ్ బాబు

  • 'సరిలేరు నీకెవ్వరు' తాజా టీజర్ రిలీజ్
  • ఆకట్టుకునేలా డైలాగ్స్
  • పవర్ ఫుల్ డైలాగులతో అదరగొట్టిన మహేశ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా తాజా టీజర్ రిలీజైందని మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఈ సంక్రాంతి మరింత చిరస్మరణీయం అవుతుందని పేర్కొన్నాడు.

కాగా, ఈ టీజర్ లో మహేశ్ బాబు పంచీ డైలాగ్స్ తో అదరగొట్టాడు. "భయపడేవాడే బేరానికి వస్తాడు... మనదగ్గర బేరాల్లేవమ్మా...." అంటూ తనదైన శైలిలో పలికిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు" అంటూ విజయశాంతి, "ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్ రాజ్ పలికిన సంభాషణలు ఆడియన్స్ లో చొచ్చుకుపోతాయనడంలో సందేహంలేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు.

More Telugu News