arjun rampal: రెండు దశాబ్దాల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్-జెసియా

  • విడాకులు తీసుకుంటున్నట్టు గతేడాది ప్రకటించిన అర్జున్
  • తాజాగా విడాకులు మంజూరు చేసిన కోర్టు
  • పిల్లలు ఇద్దరు తల్లి వద్దే ఉంటారన్న న్యాయస్థానం

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్-జెసియా దంపతులు విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో వీరు ఈ నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా 21 సంవత్సరాల వీరి వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడిపోతున్నట్టు గతేడాది వీరిద్దరూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. రాంపాల్-జెసియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు మహిక, మైరా ఉన్నారు. వీరిద్దరూ తల్లి వద్దే ఉంటారని విడాకుల మంజూరీ సందర్భంగా కోర్టు పేర్కొంది. విదేశీ మహిళ గాబ్రియెల్లాతో డేటింగ్‌లో ఉన్న అర్జున్‌కు ఆమె ద్వారా ఇటీవల ఓ బాబు జన్మించాడు.

More Telugu News