ఇదో వెరైటీ పెళ్లి.. శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న వధువు!
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో
- కరతాళ ధ్వనులతో స్వాగతించిన బంధువులు, స్నేహితులు
- వయ్యారంగా శవపేటిక నుంచి లేచి వరుడి చెంతకు వధువు
తాజాగా ఇందుకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఘనా దేశంలో ఓ పెళ్లి కుమార్తె శవపేటికలో మండపానికి వచ్చి అందరినీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. ఈ శవ పేటికను కొంతమంది పెళ్లి వేడుక జరిగే ప్రదేశానికి మోసుకొచ్చారు. దానిపై పరచిన నల్లని వస్త్రాన్ని తొలగించి మూతను తెరిచారు. వేడుకలో పాలుపంచుకోవడానికి వచ్చిన బంధువులు, స్నేహితులు చప్పట్లు కొడుతున్న సమయంలో శవ పేటిక నుంచి పెళ్లి కుమార్తె లేచి.. వయ్యారంగా నడుస్తూ వరుడి వద్దకు చేరుకుంది. మీరూ ఈ వీడియో చూడండి.