bus: వేగంగా వెళుతోన్న బస్సు నుంచి దూకి ఆత్మహత్య.. తోటి ప్రయాణికులు పట్టుకున్నా విడిపించుకున్న వైనం

షార్ట్స్‌లో చూడండి
వేగంగా వెళుతోన్న బస్సు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అతడు బస్సులోంచి దూకాలని చూస్తోన్న విషయాన్ని తోటి ప్రయాణికులు గమనించి అతడిని పట్టుకోవాలని చూసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వైద్యపరీక్షల కోసం ఆ వ్యక్తి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సులో వెళుతూ ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడ్డాడు.

విజయనగరంలోని పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద  అతడు బస్సులోంచి దూకేయడంతో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి పేరు, వివరాలపై ఆరా తీస్తున్నారు. అతడి వద్ద ఆరోగ్య పరీక్షల రిపోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
bus
Road Accident
Vizag
Vijayanagaram District

More Telugu News