Jagan: నేడు యానాంలో జగన్ పర్యటన.. పుదుచ్చేరి ఆరోగ్య మంత్రిని పరామర్శించనున్న సీఎం

  • ఈ నెల 7న కన్నుమూసిన మల్లాడి తండ్రి
  • నేటి పెద్ద కర్మ కార్యక్రమానికి జగన్ హాజరు
  • నిన్న మల్లాడిని పరామర్శించిన జనసేన నేత

పుదుచ్చేరి ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు పరామర్శించనున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లాడి తండ్రి సూర్యనారాయణ ఈ నెల 7న కన్నుమూశారు. నేడు పెద్ద కర్మ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న జగన్.. మల్లాడిని పరామర్శిస్తారు.

మల్లాడి కుటుంబంతో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి మల్లాడి కూడా హాజరయ్యారు.  ఈ సందర్భంగా జగన్‌కు వైఎస్ విగ్రహాన్ని బహూకరించారు. కాగా,  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత కస్తూరి సత్యప్రసాద్ (నాని) నిన్న యానాంలో మల్లాడిని పరామర్శించారు.

More Telugu News