YSRCP: జేసీ బ్రదర్స్ కు షాకిచ్చిన ముఖ్య అనుచరుడు షబ్బీర్ అలీ.. వైసీపీలో చేరిక!

  • ఎన్నో ఏళ్లుగా జేసీ బ్రదర్స్ వెంట తిరిగిన షబ్బీర్ అలీ
  • ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక
  • వైసీపీలో చేరిన దాదాపు 500 మంది

అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయ నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలకు ఎన్నో ఏళ్లుగా ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేడు గోరాతో పాటు దాదాపు 500 మంది తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిలో లారీల యజమానులు, పలువురు జేసీ అనుచరులు కూడా ఉన్నారు. వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించిన పెద్దారెడ్డి, ముఖ్య నేతలకు వైసీపీ కండువాలు కప్పారు. 

More Telugu News