India: భారత వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఆశలు గల్లంతు!

  • ఒమన్ తో క్వాలిఫయర్ మ్యాచ్
  • 0-1 తేడాతో ఓడిన భారత్
  • గ్రూప్-ఈలో నాలుగో స్థానంతో సరి

2022లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనాలన్న భారత ఆశలు గల్లంతయ్యాయి. మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఒమన్ తో తలపడిన భారత జట్టు 0-1తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్ ఈలో ఇండియా కేవలం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండిపోయింది. నాలుగో స్థానంలోని జట్టుకు రెండో రౌండ్ క్వాలిఫయర్ పోటీలు ఆడే అవకాశం లేకపోవడంతో భారత జట్టు కథ ముగిసినట్టే.

More Telugu News