USA: 145 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా

  • ఈ రోజు ఢిల్లీ చేరుకోనున్న భారతీయులు
  • అంతర్జాతీయ ఏజెంట్ల ద్వారా యూఎస్ చేరుకుంటున్న వైనం
  • అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్

తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చారనే కారణంతో 145 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరితో పాటు పలువురు శ్రీలంక, బంగ్లాదేశ్ వాసులను కూడా వెనక్కి పంపించేసింది. భారతీయులంతా ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అమెరికా అధికారుల కథనం ప్రకారం... వీరంతా గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాకు చేరుకున్నారు. మరికొందరు వీసా గడువు ముగిసినప్పటికీ చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో, అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.

More Telugu News