Hyderabad: హైదరాబాద్ - విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం... అదుపుతప్పి నాలుగు కార్లను ఢీకొన్న ఇసుక లారీ

  • నకిరేకల్ వద్ద ప్రమాదం
  • 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు

వేగంగా వస్తూ అదుపు తప్పిన ఓ ఇసుకలారీ, మూడు కార్లను ఢీకొన్న ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి, దెబ్బతిన్న కార్లను జేసీబీ సాయంతో రహదారిపై నుంచి తొలగించి, ట్రాఫిక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

More Telugu News