Sharwanand: తిరుపతి పరిసరాల్లో 'శ్రీకారం' షూటింగ్ 

  • శర్వానంద్ హీరోగా 'శ్రీకారం'
  • దర్శకుడిగా కిషోర్ రెడ్డి పరిచయం 
  • పంట పొలాల్లో షూటింగ్

శర్వానంద్ కథానాయకుడిగా 'శ్రీకారం' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కిషోర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. జూన్ లో పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ సినిమా, అప్పటి నుంచి చకచకా షూటింగు జరుపుకుంటూ వెళుతోంది. తాజా షెడ్యూల్ ను 'తిరుపతి' పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. తిరుపతికి సమీపంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది.

14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట - గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించాడు. పూజా కార్యక్రమాలను జరిపిన రోజునే, ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని చెప్పారు. కానీ ఆ తేదీకి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 

More Telugu News