Rana: 'హిరణ్య కశిప' కోసం మళ్లీ కసరత్తు మొదలెట్టనున్న రానా

  • గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశిప'
  • 150 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 
  • ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సురేశ్ బాబు

రానా ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశిప' చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. మరో వైపున షాట్ డివిజన్ తో సహా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఇటీవల అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్న రానా .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. 'హిరణ్య కశిప'లో ప్రధాన పాత్రను చేయనున్న ఆయన, ఆ పాత్ర కోసం మళ్లీ కండలు పెంచవలసి వుంది. త్వరలోనే అందుకు సంబంధించిన కసరత్తు మొదలుకానుందని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తమ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దడానికి సురేశ్ బాబు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

More Telugu News