Vijay Sai Reddy: చంద్రబాబు నాయుడు గారు పాతాళంలోకి జారిపోయారు: విజయసాయి రెడ్డి

  • ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాలి 
  • ఆయనలో అసూయ, అహంకార ప్రవర్తన ఉంది 
  • చివరకు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన హుందాగా ఉండట్లేదని, అసూయ, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.  

'ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన వాడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నాడు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 

More Telugu News