Toss: టాస్ గెలిచిన బంగ్లాదేశ్... భారత్ కు బ్యాటింగ్

  • నాగ్ పూర్ లో వేదికగా మూడో టి20 మ్యాచ్
  • టీమిండియాలో శివం దూబేకు చోటు
  • దేశవాళీ పోటీల్లో హార్డ్ హిట్టర్ గా పేరుతెచ్చుకున్న దూబే

మూడు టి20ల సిరీస్ లో చివరిదైన మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ హార్డ్ హిట్టర్ శివం దూబేను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో అందరి కళ్లు ఈ యువ బ్యాట్స్ మన్ పైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. దేశవాళీ పోటీల్లో సిక్సర్ల వీరుడిగా దూబేకు మంచి గుర్తింపు ఉంది. మరి అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది.

కాగా, ఈ మూడు టి20ల సిరీస్ లో టీమిండియా, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ మూడో టి20లో విజేతగా నిలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.

More Telugu News