Andhra Pradesh: ఏపీలో వాగులోకి దూసుకుపోయిన బస్సు

  • ఒక పక్కకు ఒరిగి ఆగిపోవడంతో తప్పిన ప్రమాదం
  • 42 మంది ప్రయాణికులు సురక్షితం
  • స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరిన ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు కాలువలోకి దూసుకుపోయి ఒక పక్కకు ఒరిగిపోయి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు బయటకు రావడానికి స్థానికులు సహాయం చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

More Telugu News