Uddhav Thackerey: ఇచ్చిన మాటపై బీజేపీ నిలబడాలనేదే మా డిమాండ్: ఉద్ధవ్ థాకరే

  • కూటమి విచ్ఛిన్నమవ్వాలని కోరుకోవడం లేదన్న ఉద్ధవ్
  • శివసేన ఎమ్మెల్యేలతో గంటన్నర సేపు ఉద్ధవ్ భేటీ
  • మీడియాను అనుమతించని శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేనల మధ్య నెలకొన్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ సందర్భంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, కూటమి విచ్ఛిన్నమవ్వాలని శివసేన కోరుకోవడం లేదని చెప్పారు. ఇచ్చిన మాటపై బీజేపీ నిలబడాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించలేదు. మరోవైపు, ఎమ్మెల్యేలు ఎవరూ తమ ఫోన్లను సమావేశ మందిరంలోకి తీసుకురావద్దని... బయటే ఉంచి రావాలని ఉద్ధవ్ ఆదేశించారు.

More Telugu News