RTC Strike: విధుల్లో చేరిన వారిపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులు.. డ్రైవర్ ను చితకబాదిన వైనం!

  • మహబూబ్ నగర్ లో విధుల్లో చేరిన ఉద్యోగులపై దాడి
  • డ్రైవర్ తాజుద్దీన్ ను చితకబాదిన కార్మికులు
  • పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట

విధుల్లో చేరాలనుకున్న ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ నిన్న అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వం విధించిన గడువులోపల కొందరు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో, మహబూబ్ నగర్ లో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. విధుల్లో చేరిన డ్రైవర్ తాజుద్దీన్ ను కార్మికులు చితకబాదారు. మహిళా కండక్టర్ కోమల, వాజిద్ లపై దాడి చేశారు. డిపోలోకి దూసుకెళ్లిన కార్మికులు ఈ దాడికి పాల్పడ్డారు.

ఇదే సమయంలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. డిపో నుంచి బయటకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. అనంతరం కార్మికులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు.

  • Loading...

More Telugu News