Chiranjeevi: 'సైరా'లో కనిపించని 8 కోట్ల సాంగ్.. చరణ్ నిర్ణయం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

  • దేశభక్తి చిత్రంగా రూపొందిన 'సైరా'
  • పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు 
  •  యూట్యూబ్ లో రిలీజ్ చేయమంటున్న ఫ్యాన్స్

చిరంజీవి .. నయనతార .. తమన్నా ప్రధాన పాత్రధారులుగా 'సైరా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసి, గొప్ప దేశభక్తి  చిత్రంగా ప్రశంసించారు. అలాంటి ఈ సినిమా కోసం చిరంజీవి - తమన్నాపై ఒక పాటను చిత్రీకరించారు. 8 కోట్ల ఖర్చుతో ఈ పాటను చిత్రీకరించడం విశేషం.

అయితే కథాగమనానికి ఈ పాట అడ్డుపడుతోందని భావించారు. ఎక్కడా ఇరికించే  ప్రయత్నం చేయవద్దని చరణ్ చెప్పడంతో పక్కన పెట్టేశారు. అంత ఖరీదైన పాట ఎలా వుందో .. ఏ స్థాయిలో చిత్రీకరించారో అనే ఆసక్తి మెగా అభిమానుల్లో వుండిపోయింది. ఈ పాటను చూడాలనే కుతూహలంతో, యూట్యూబ్ లో విడుదల చేయవలసిందిగా వాళ్లంతా చరణ్ ను కోరుతున్నారు. సోషల్ మీడియా ద్వారా చరణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చరణ్ ఏం చేస్తాడో చూడాలి.

More Telugu News