Andhra Pradesh: ప్రతిభా పురస్కారాల పేరు మార్చుతూ ఇచ్చిన జీవో రద్దు

  • ప్రతి ఏటా అబ్దుల్ కలాం పేరిట ప్రతిభా పురస్కారాలు
  • వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల పేరిట పేరు మార్పు
  • తీవ్రస్థాయిలో విమర్శలు
  • జీవో రద్దు చేయాలంటూ జగన్ ఆదేశాలు

ఏపీలో ప్రతి ఏటా విద్యార్థులకు అబ్దుల్ కలామ్ పేరిట ఇచ్చే ప్రతిభా పురస్కారాలను వైఎస్సార్ ప్రతిభా పురస్కారాలుగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆ జీవో రద్దు చేయాలంటూ సీఎం జగన్ ఆదేశించడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రతిభా పురస్కారాల పేరు మార్చుతూ ఇచ్చిన జీవోను రద్దు చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.

More Telugu News