Vijaya Reddy: విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ ఎవరో నాకు తెలియదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

  • విజయారెడ్డి హత్య దురదృష్టకరం
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలి
  • ప్రతిరోజు నన్ను ఎందరో కలుస్తుంటారు

హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి నిన్న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సురేశ్ అనే వ్యక్తి ఆమెను ఆఫీసులోనే పెట్రోల్ పోసి, నిప్పంటించి చంపేశాడు. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మరోవైపు, విజయారెడ్డి మాట్లాడుతున్నట్టున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఆమె కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ మంత్రి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు ఇందులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేశ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది ప్రతిరోజు తనను కలుస్తుంటారని తెలిపారు. విజయారెడ్డి హత్య దురదృష్టకరమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఈ ఉదయం విజయారెడ్డి భౌతికకాయానికి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

More Telugu News