BJP: మీ ఇంట్లో కుక్క మాంసం తినండి.. నో ప్రాబ్లం!: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • కొందరు మేధావులు రోడ్లపైనే గొడ్డు మాంసం తింటున్నారు
  • ఏ జంతు మాంసం తిన్నా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది
  • అయితే, రోడ్లపై ఎందుకు తింటున్నారు?
  • బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్

బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కొందరు మేధావులు రోడ్లపైనే గొడ్డు మాంసం తింటున్నారు. కుక్క మాంసమైనా సరే తినండి.. ఏ జంతు మాంసం తిన్నా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే, రోడ్లపై ఎందుకు తింటున్నారు? మీ ఇళ్లలో తినండి' అని వ్యాఖ్యానించారు.

'గోవు మన తల్లివంటిది. మనం ఆవు పాలు తాగుతూ బతుకుతున్నాం. నా తల్లిని అగౌరవ పర్చేలా ఎవరైనా ప్రవర్తిస్తే నేను కూడా ఇటువంటి వారితో అలాగే ప్రవర్తిస్తాను. పవిత్ర భారతావనిలో గోవులను చంపడం, గొడ్డు మాంసం తినడం నేరం' అని దిలీప్ ఘోష్ అన్నారు. ఆయన గతంలోనూ చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

More Telugu News