KCR: ఉద్యోగాలు కాపాడుకోవడమా, కోల్పోవడమా కార్మికులే తేల్చుకోవాలి: సీఎం కేసీఆర్

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • సీఎం కేసీఆర్ సమీక్ష
  • గడువులోగా చేరకుంటే ఉద్యోగాలు కోల్పోతారని హెచ్చరిక

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నవంబరు 5 అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరాలని గడువు విధించామని, గడువు లోపు విధుల్లో చేరని ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కాపాడుకుంటారో, కోల్పోతారో కార్మికులే తేల్చుకోవాలని అన్నారు. నవంబరు 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరకుంటే ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ఆర్టీసీ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.

More Telugu News