Chandrababu: చింతమనేనిపై రోజుకో కేసు పెడుతూ బెయిల్ రాకుండా చేస్తున్నారు: చంద్రబాబు

  • వైసీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారు
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని పీఎస్ ల చుట్టూ తిప్పుతున్నారు

వైసీపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై రోజుకో కేసు పెడుతూ, బెయిల్ రాకుండా చేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News