మనం తీసుకునే ఊపిరిలో ఆక్సిజన్ తగు మోతాదులో ఉండాలి, ఇక్కడ అలా లేదు: టీమిండియా బౌలర్ అశ్విన్
- ఢిల్లీలో ప్రమాదకర స్థితికి చేరిన వాయు కాలుష్యం
- గాలిలో క్షీణించిన నాణ్యత
- పరిస్థితి భీతావహంగా ఉందన్న అశ్విన్
అంతకుముందు, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో మాట్లాడుతూ, వాయు కాలుష్యంతో తామేమీ ఇబ్బంది పడబోమని, మ్యాచ్ సజావుగానే జరుగుతుందని భరోసా ఇచ్చాడు. అటు, బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో కూడా ఇదే తరహాలో అభిప్రాయం వెలిబుచ్చాడు. 'కాలుష్యం ఉన్న మాట నిజమే అయినా, మూడు గంటలు మైదానంలో గడిపినంత మాత్రాన చచ్చిపోము కదా?' అంటూ వ్యాఖ్యానించాడు.