అప్పట్లో జమున ప్రయాణిస్తున్న బస్సు, ప్రమాదానికి గురైందట!
ఆ ప్రదర్శనల కవరేజీ కోసం 'విజయచిత్ర' తరఫున నేను వెళ్లాను. శ్రీకాకుళంలో ప్రదర్శన ముగించుకుని మేమంతా స్పెషల్ బస్సులో గుంటూరు వెళుతుండగా, రాత్రివేళ మా బస్సుకు ఒక ముసలావిడ అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగింది. ఊళ్లో జనమంతా అక్కడ పోగయ్యారు. బస్సు లోపల అంతా లేడీ ఆర్టిస్టులు. ఆ విషయం అక్కడి వాళ్లకి తెలిస్తే మరింత సమస్య అవుతుంది. అందువలన నేను .. జమున సోదరుడు మాత్రమే బస్సు దిగి, పోలీసులకి సమాచారాన్ని అందించాము. వాళ్లు వచ్చేవరకూ ఎలాంటి గొడవ జరక్కుండా ఊళ్లో వాళ్లతో మంచిగా మాట్లాడుతూ సమయాన్ని గడిపాము. ఇప్పటికీ అది ఒక భయంకరమైన అనుభవంలాగే అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.