Arvind Kejriwal: మహిళల స్పందనను తెలుసుకునేందుకట.. బస్సెక్కిన ఢిల్లీ సీఎం!

  • సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం
  • మహిళల స్పందన తెలుసుకునేందుకు బస్సులో ప్రయాణం
  • ప్రతిపక్షాలపై విమర్శలు

దేశ రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన పథకంపై మహిళలు ఎలా స్పందిస్తున్నదీ తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బస్సెక్కారు. సిటీ బస్సులో ప్రయాణించి ఈ పథకంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని ఎప్పటికైనా గొప్పగానే ఉంటుందని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టలేదని, వారి భద్రత కోసం 13వేల మంది మార్షల్స్‌ను నియమించినట్టు సీఎం వివరించారు.

More Telugu News