Kanna Lakshmi Narayana: రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా ఉంది: వైసీపీపై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు

  • ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • మరోవైపు వైసీపీ వాళ్ల రంగుల పిచ్చి పెరిగిపోయింది
  • ఆఖరికి జాతీయ జెండానూ అవమానిస్తున్నారు 
  • పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం చట్ట వ్యతిరేకం
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం గోడపై ఉన్న జెండా కనపడకుండా ఆ మూడు రంగులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను వేయించారు. వైసీపీ తీరుపై  బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.

'రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా వైసీపీ పాలన ఉంది. ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు వైసీపీ వాళ్ల రంగుల పిచ్చి ఆఖరికి జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చింది.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకం' అని ట్వీట్ చేశారు.
Kanna Lakshmi Narayana
YSRCP

More Telugu News