Chinthamaneni Prabhakar: చింతమనేని రిమాండు పొడిగింపు.. మళ్లీ జైలుకు తరలింపు

  • చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
  • రిమాండ్ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • రిమాండ్ పొడిగించిన కోర్టు

టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఈ మధ్యాహ్నం ఆయనను జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయన రిమాండ్ ను నవంబర్ 6వ తేదీ వరకు కోర్టు పొడిగించింది.

పినకడిమికి చెందిన జోసెఫ్ ను తనపై పెట్టిన కేసును వాపసు తీసుకోవాలని బెదిరించారంటూ చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో ఆయన ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ గడువు పూర్తైన నేపథ్యంలో, ఆయనను పోలీసులు మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News