T20: వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ కు క్వాలిఫై అయిన రెండు కొత్త జట్లు!

  • వచ్చే ఏడాది అక్టోబర్ 18న ప్రపంచకప్ ప్రారంభం
  • నవంబర్ 15న మెల్బోర్న్ లో ఫైనల్స్
  • అర్హత సాధించిన పపువా న్యూ గినియా, ఐర్లండ్

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరగబోతోంది. ఈ టోర్నీకి రెండు కొత్త జట్లు అర్హత సాధించాయి. ఇంతకు ముందే ఐర్లండ్ ఈ టోర్నీకి క్వాలిఫై కాగా... పపువా న్యూ గినియా నిన్న అర్హత సాధించింది. కెన్యాతో నిన్న జరిగిన మ్యాచ్ లో పపువా న్యూ గినియా 45 పరుగుల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్ లో స్కాట్లాండ్ జట్టుతో నెదర్లాండ్స్ ఓటమిపాలు కావడంతో... పపువా న్యూ గినియా నెట్ రన్ రేట్ ఆధారంగా ప్రపంచకప్ కు క్వాలిఫై అయింది. వచ్చే ఏడాది అక్టోబర్ 18న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నవంబర్ 15న మెల్బోర్న్ లో ఫైనల్స్ జరగనుంది.

మొత్తం 16 టీములు ప్రపంచకప్ లో పోటీ పడబోతున్నాయి. ఐసీసీ ఫుల్ మెంబర్స్ అయిన ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజీలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లు ఈ టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. క్వాలిఫైయర్ కేటగిరిలో ఇప్పటి వరకు పపువా న్యూ గినియా, ఐర్లండ్ క్వాలిఫై అయ్యాయి. మరో నాలుగు జట్లు అర్హత సాధించాల్సి ఉంది.

More Telugu News