Nikhil: నిఖిల్ సినిమా విడుదలకి ముహూర్తం కుదిరింది

  • నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం'
  • హిట్ పై నమ్మకంతో వున్న నిఖిల్
  • వచ్చేనెల 29వ తేదీన విడుదల 

నిఖిల్ మొదటి నుంచీ కూడా కథాకథనాల్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకువెళుతున్నాడు. అలాగే ఆయన సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' సినిమాను చేశాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా, కొంతకాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన విడుదల తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల కోసం నిఖిల్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో. అలాగే కెరియర్ పరంగా జోరు తగ్గిన లావణ్య త్రిపాఠికి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News