Tridandi: చినజీయర్ స్వామి సమక్షంలో.. ‘ఆదర్శ దిన చర్య 2020’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి

  • త్రిదండి చిన జీయర్ స్వామిని కలిసిన వెల్లంపల్లి
  • దేవాలయాల అభివృద్ధిపై చినజీయర్ సూచనలు
  • ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామన్న మంత్రి

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని చిన జీయర్ స్వామి ఆశ్రమానికి ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా వెల్లంపల్లిని మంగళాశాసనంతో ఆశీర్వదించి సన్మానించారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు అందించాల్సిన సౌకర్యాలు, సేవలపై మంత్రికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఆదర్శ దిన చర్య 2020’ పుస్తకమును స్వామి వారి సమక్షంలో వెల్లంపల్లి ఆవిష్కరించారు.

More Telugu News