APSRTC: ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ నియామకం

  • ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం
  • ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
  • వచ్చే నెల 15 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగం పుంజుకుంది. సర్కారులో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు తాజాగా వర్కింగ్ గ్రూప్ ను నియమించారు. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖ అధికారులు ఈ వర్కింగ్ గ్రూప్ లో సభ్యులుగా ఉంటారు. మొత్తం ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, ఉద్యోగాలు, హోదాల ఏర్పాటుపైనా ఈ వర్కింగ్ గ్రూప్ దృష్టి పెట్టనుంది. జీతాల చెల్లింపు, పే స్కేల్ వంటి అంశాల్లోనూ విధివిధానాలను వర్కింగ్ గ్రూప్ ఖరారు చేయనుంది. దీనిపై వచ్చే నెల 15 లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

More Telugu News