Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 38 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 21 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • నష్టాలను చవిచూసిన ఇన్ఫోసిస్, ఎస్బీఐ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు నష్టపోయి 39,020కి పడిపోయింది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,582 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్  (3.01%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.98%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.96%), ఏసియన్ పెయింట్స్ (1.45%), టాటా స్టీల్ (0.95%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.49%), ఇన్ఫోసిస్ (-2.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.55%).

More Telugu News