BJP: బీజేపీ-శివసేన కూటమికి మేలు చేసిన ఎంఐఎం

  • మహారాష్ట్రలో ముందంజలో ఉన్న బీజేపీ-శివసేన కూటమి
  • రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎంఐఎం
  • 24 స్థానాల్లో ముస్లిం ఓట్లను చీల్చిన మజ్లిస్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా వెలువడుతున్నాయి. అధికారాన్ని చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు కాగా... ఈ కూటమి 161 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 96 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

మరోవైపు ఈ ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన ఎంఐఎం పార్టీ తనదైన స్థాయిలో సత్తా చాటింది. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం... రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు, పోటీ చేసిన అన్ని స్థానాల్లో ముస్లింల ఓట్లను భారీగా చీల్చింది. తద్వారా ముస్లిం ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది పరోక్షంగా బీజేపీ-ఎన్సీపీ కూటమికి లాభించింది.

More Telugu News