Vijay Devarakonda: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'ఫైటర్'తో జతకట్టనున్న జాన్వీ 
  • షూటింగుకి రెడీ అవుతున్న చిరంజీవి
  • కొత్త హీరో సరసన ఐదుగురు నాయికలు    

*  విజయ్ దేవరకొండ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కథానాయికగా నటించనుంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'ఫైటర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో నాయికగా జాన్వీని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
*  'సైరా' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగును రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుందని అంటున్నారు.  
*  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్నబ్బాయి సాయి గణేశ్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో సాయి గణేశ్ సరసన మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట. వీరిలో ఇప్పటికే నటాష, దీక్ష నాగర్కర్, అనన్య అగర్వాల్ ఎంపికవగా, మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాల్సి వుంది.

More Telugu News