Mahesh Babu: మహేశ్ సినిమా నుంచి దీపావళికి విజయశాంతి ఫస్టులుక్

  • హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి
  • రాజకీయాల కారణంగా సినిమాలకి దూరం 
  • 13 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ

అందం .. అభినయం కలగలిసిన నిన్నటితరం కథానాయికలలో విజయశాంతి ఒకరు. 2006లో 'నాయుడమ్మ' సినిమా తరువాత విజయశాంతి రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆ కారణంగా ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇంతకాలానికి .. అంటే 13 ఏళ్ల తరువాత ఆమె 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమాలో ఆమె రాయలసీమకి చెందిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి విజయశాంతి లుక్ ఎలా వుండనుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజున ఆమె ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. మహేశ్ బాబు .. రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News