Venkatesh Maha: 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడి నుంచి మరో సినిమా

  • 'కేరాఫ్ కంచరపాలెం'తో మంచి పేరు 
  • మలయాళ హిట్ మూవీకి రీమేక్ 
  •  వచ్చేనెలలో షూటింగు పూర్తి 

'కేరాఫ్ కంచరపాలెం' సినిమా ద్వారా తెలుగు తెరకి వెంకటేశ్ మహా దర్శకుడిగా పరిచయమయ్యాడు. వాస్తవానికి చాలా దగ్గరగా ఆయన అల్లుకున్న కథ .. సహజత్వంతో కూడిన పాత్రలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలను అందుకుంది. అప్పటి నుంచి వెంకటేశ్ మహా నుంచి రానున్న తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఒక మలయాళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఆ మలయాళ సినిమా పేరే 'మహేషింటే ప్రతీకారం. దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి వసూళ్లతో పాటు జాతీయ అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి వెంకటేశ్ మహా రీమేక్ చేస్తున్నాడు. సత్యదేవ్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, వచ్చేనెలలో షూటింగును పూర్తిచేసుకోనుంది.

More Telugu News