Srisailam: శ్రీశైలం వచ్చిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్

  • శ్రీశైలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
  • మహాశక్తి యాగంలో పాల్గొన్న మోహన్ భగవత్
  • తిరుమల చేరుకున్న తమిళిసై

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ శ్రీశైలం విచ్చేశారు. ఆయన ఇక్కడి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో జరిగిన మహాశక్తి యాగంలో పాల్గొన్నారు.

తిరుమల చేరుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల విచ్చేశారు. ఆమెకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తమిళిసై గవర్నర్ హోదాలో రేపు తొలిసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

More Telugu News