ఇంటర్ బోర్డులు పెట్టి ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఎలా ఇస్తారు?: మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యలు
- 2 వేలకు పైగా కాలేజీలు నిబంధనలు పాటించడం లేదన్న మంత్రి
- పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
- నేమ్ బోర్డులపై కాలేజీ పేరు, కోడ్ నెంబరు మాత్రమే ఉండాలని స్పష్టీకరణ
అంతేకాకుండా, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు, ఇతర పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సి ఉందని, అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీలపై బోర్డులపై కాలేజీ పేరు, కోడ్ నెంబరు మాత్రమే ఉండాలని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు. ఇకమీదట ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఏకీకృత నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తాము సూచించిన విధంగా నేమ్ బోర్డులను 10 రోజుల్లోగా ఏర్పాటు చేయకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.