Telugudesam: మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ తిక్కారెడ్డి అరెస్టు!

  • తిక్కారెడ్డి భాగస్వామిగా నడుస్తున్న మద్యం పరిశ్రమ
  • ఈ పరిశ్రమ కోసం ధాన్యం కొనుగోలు 
  • తనకు చెల్లించాల్సిన సొమ్ము ఇవ్వలేదని విక్రయదారుడి ఫిర్యాదు

కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ తిక్కారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఓ మద్యం పరిశ్రమలో తిక్కారెడ్డి భాగస్వామి. ఈ పరిశ్రమ కోసం ముడిసరుకును రైతుల నుంచి ఆయన కొనుగోలు చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన డబ్బు రూ.12 కోట్లు తమకు ఇవ్వలేదని రైతులు ఆరోపించారు.

ఈ మేరకు బేగంపేట పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో బేగంపేట పోలీసులు ఎమ్మిగనూరు వెళ్లారు. స్థానిక పోలీసుల సాయంతో తిక్కారెడ్డిని ఆయన స్వగృహంలో అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు.

More Telugu News