Crime News: కూతురి ఆత్మహత్య... తట్టుకోలేక తల్లి బలవన్మరణం

  • ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్న కుమార్తె
  • దీన్ని భరించలేక తల్లి కూడా అదే బాట
  • సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఘటన

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే, ఈ విషయాన్ని తట్టుకోలేక తల్లికూడా బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెల్లగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన మాశెట్టి నాగమ్మ (40), గంగమ్మ (68) తల్లీకూతుళ్లు.  ఇద్దరూ వితంతువులే. రాళ్లు కొట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి నాగమ్మ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురి మరణంతో దిగ్భ్రమకు గురైన గంగమ్మ కాసేపటికి తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. స్థానికులను విచారించిన అనంతరం ఆర్థిక ఇబ్బందులవల్లే నాగమ్మ చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారించారు.

More Telugu News