Andhra Pradesh: పోలీసులు వున్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమే: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • రేపటితో ముగియనున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలు
  • పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ఉండకూడదు
  • ఇప్పటి వరకూ 1.4 లక్షల మంది విద్యార్థులు పీఎస్ లను సందర్శించారు

పోలీసులు ఉన్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమేనని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారోత్సవాల సందర్భంగా సాధారణ ప్రజలకు కూడా పోలీసుల గురించి తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు పోటీలు నిర్వహించామని చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ఇప్పటి వరకూ 1.4 లక్షల మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్లను సందర్శించారని అన్నారు. కాగా, పోలీస్ అమరవీరుల వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.  

  • Loading...

More Telugu News